బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘ధురందర్’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది . ఈ ఫ్రాంచైజీలోని రెండు చిత్రాలు కలిసి రూ. 3,100 కోట్లకు పైగా వసూలు చేశాయి. అయితే, జూలై 10న జపాన్లో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా చిత్రం, అక్కడి బాక్సాఫీస్ వద్ద చాలా నిరాశాజనకమైన ప్రదర్శనతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం జపాన్లో సుమారు 80 స్క్రీన్లలో అంగరంగ వైభవంగా విడుదలైంది. విడుదలకు ముందు జపాన్లో ఈ చిత్రానికి భారీగా ప్రచారం కల్పించారు. అయితే, నివేదికల ప్రకారం, శుక్ర, శని, ఆదివారాల్లో జపాన్లోని టాప్ 25 చిత్రాల జాబితాలో కూడా ఈ చిత్రం చోటు సంపాదించలేకపోయింది. విడుదలైన మొదటి రోజున, మధ్యాహ్నం 2 గంటల వరకు 57 థియేటర్లలో ఈ చిత్రాన్ని కేవలం 449 మంది ప్రేక్షకులు మాత్రమే చూశారు. రోజు రెండవ భాగంలో కూడా సినిమా వసూళ్లలో చెప్పుకోదగ్గ మెరుగుదల ఏమీ కనిపించలేదు. మొత్తంగా, మొదటి రోజు జపాన్లోని 80 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని కేవలం 900 మంది ప్రేక్షకులు మాత్రమే చూశారు.
కాగా జపాన్ లో ఇప్పటివరకుప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ 1300 టికెట్స్తో చివరి స్థానంలో ఉంది. కొన్ని రోజుల క్రితమే ఇక్కడ రిలీజైన పుష్ప 2 దీనిని బ్రేక్ చేయలేకపోయింది. జపాన్లో రిలీజైన పుష్ప-2 మూవీకి కేవలం 886 టికెట్స్ మాత్రమే అమ్ముడయ్యాయి. తాజాగా దురంధర్కు 900 టికెట్స్ మాత్రమే బుకింగ్స్ లభించాయి. కాగా గతంలో జపాన్లో విడుదలైన మొదటి రోజే 8230 టికెట్లతో ‘ఆర్ఆర్ఆర్’ అతిపెద్ద ఇండియన్ ఓపెనర్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వరుసగా ‘సాహో’, ‘కల్కి 2898 ఏడీ’, ‘పఠాన్’, ‘సలార్’, ‘జవాన్’, ‘రంగస్థలం’, ‘దేవర’, ‘బాహుబలి 2’ ‘టైగర్ 3’ సినిమాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
అప్పుడు పుష్ప 2, ఇప్పుడు ధురంధర్..
#DHURANDHAR FAILS IN JAPAN
Despite the Dhurandhar franchise crossing ₹3,100 crore worldwide, its Japan release has opened to a weak response.
The Ranveer Singh starrer reportedly sold tickets to only around 900 viewers on Day 1 despite releasing across nearly 80 screens,… pic.twitter.com/TGRgRaj2qe
— Anjali (@Vada_paaww) July 13, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.